ఎమ్.ఎస్ ధోని 2016లో విడుదలైన హిందీ సినిమా. భారత జాతీయ క్రికెట్ జట్టు మాజీ టెస్ట్, వన్డే, టి20 కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జీవితం కథ ఆధారంగా ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ఇన్స్పైర్డ్ ఎంటర్టైన్మెంట్, ఫ్రైడే ఫిలింవర్క్స్ బ్యానర్లపై అరుణ్ పాండే, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమాకు నీరజ్ పాండే దర్శకత్వం వహించాడు. సుశాంత్ సింగ్ రాజ్పుత్, దిశా పటాని, కియారా అద్వానీ, అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 30న విడుదలైంది.