భీష్మ 2020, ఫిబ్రవరి 21న విడుదలైన తెలుగు చలనచిత్రం. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మాణ సారధ్యంలో వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నితిన్, రష్మిక మందణ్ణా, అనంత్ నాగ్, జిషు సేన్గుప్తా, విజయ నరేష్, వెన్నెల కిషోర్ తదితరులు నటించగా, మహతి స్వరసాగర్ సంగీతం అందించాడు.