పరిణయం 2021లో విడుదలైన తెలుగు సినిమా. మలయాళంలో 2020లో విడుదలైన ‘వరనే అవశ్యముంద్’ సినిమాను తెలుగులో పరిణయం పేరుతో అనువాదం చేశారు.వేఫారెర్ ఫిలిమ్స్, ఎం స్టార్ట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ సినిమాకు అనూప్ సత్యన్ దర్శకత్వం వహించాడు. దుల్కర్ సల్మాన్, కల్యాణి ప్రియదర్శన్, సురేశ్గోపి, శోభన ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 24 సెప్టెంబర్ నుండి ‘ఆహా’ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది.