మిస్టర్ మజ్ను రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో 2019లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పి పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించాడు. అక్కినేని అఖిల్, నిధి అగర్వాల్ ప్రధాన పాత్రలలో నటించారు. జార్జ్ సి. విల్లియమ్స్ ఛాయాగ్రహణం అందించగా ఎస్.ఎస్. తమన్ సంగీతం అందరిని అలరించింది.