ఓరి దేవుడా 2022లో రూపొందిన తెలుగు సినిమా. తమిళ సినిమా ‘ఓమై కడువలే’ సినిమాను తెలుగులో పీవిపీ సినిమాస్, శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్లపై పిరల్ వి పొట్లూరి, పరమ్ వి పొట్లూరి నిర్మించిన ఈ సినిమాకు తమిళంలో దర్శకత్వం వహించిన అశ్వత్ మరిముత్తు తెలుగులో కూడా దర్శకత్వం వహించాడు. వెంకటేష్, విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, ఆశా భట్, రాహుల్ రామకృష్ణ, మురళి శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్ను అక్టోబర్ 7న విడుదల చేసి సినిమాను అక్టోబర్ 21న విడుదలైంది. ఈ సినిమా నవంబర్ 11న ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రం విమర్శకులు, ప్రేక్షకుల నుండి మిశ్రమ సమీక్షలను పొందింది.