షేర్షా 2021లో విడుదలైన హిందీ సినిమా. ధర్మ ప్రొడక్షన్స్, కాష్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై యష్ జోహార్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా, షబ్బీర్, అజయ్ షా, హిమాన్షు గాంధీ నిర్మించిన ఈ సినిమాకు విష్ణువర్థన్ దర్శకత్వం వహించాడు. సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అడ్వాణీ, శివ్ పండిట్, నిఖిత్ ధీర్, హిమాన్షో, అనిల్ చరణ్జీత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్ను జులై 25, 2021న విడుదల చేసి, 12 ఆగష్టు 2021న అమెజాన్ ప్రైమ్లో సినిమాను విడుదల చేశారు.ఈ సినిమా పరమ్ వీర్ చక్ర అవార్డు పొందిన కెప్టెన్ విక్రమ్ భాత్రా జీవిత కథ ఆధారంగా నిర్మించారు.