తంత్రసాధన, జగజ్జనని ఉపాసనలంటే లోకంలో ఉన్నభయాలను, అయోమయాలను పటాపంచలు చేస్తూ, శ్రీవిద్యాసాధన మొత్తం సరళమైన పద్యం, అంతకంటే సరళమైన వచనంలో ఈ పుస్తకంలో వివరించబడింది. ఈ పుస్తకమును చదివిన తదుపరి, జీవనసాఫల్యతనిచ్చే అసలైన శ్రీవిద్యాసాధన వైపు చదువరులు ఆకర్షితులైతే రచయిత ఉద్దేశ్యం నేరవేరినట్లేనని భావిస్తాము.
శ్రీ సత్యనారాయణ శర్మ గారు జ్యోతిష్యము, యోగము, తంత్రము, వీరవిద్యలు, ప్రత్యామ్నాయ వైద్యవిధానములలో ప్రవీణులు. భారతదేశముననూ, అమెరికా సంయుక్తరాష్ట్రలలోనూ వీరు స్థాపించిన 'పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్' ప్రపంచవ్యాప్తంగా వేలాదిమందిని ఆధ్యాత్మికమార్గంలో ఉత్తేజితుల్ని చేస్తున్నది.